నేడు 5G సేవలు ప్రారంభించనున్న మోదీ

-

దేశంలో 5జీ సేవలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇవాళ.. దిల్లీలోని ప్రగతి మైదానంలో జరిగే ఆరో విడత ఇండియా మొబైల్ కార్యక్రమంలో 5జీ సేవలను ప్రారంభించనున్నారు. ప్రస్తుతం నిర్దేశించిన కొన్ని నగరాల్లో మాత్రమే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి. వచ్చే రెండేళ్లలో దేశవ్యాప్తంగా 5జీ సేవలు విస్తరించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

2035 నాటికి భారత్‌ను 450 బిలియన్‌డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో 5జీ ముఖ్యపాత్ర పోషిస్తుందని ప్రభుత్వవర్గాలు పేర్కొన్నాయి. 5Gతో కొత్త ఆర్థిక అవకాశాలు, సామాజిక ప్రయోజనాలను పెంపొందిస్తుందని తెలిపాయి. అలాగే నూతన ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, డిజిటల్‌ఇండియా విజన్‌ను చేరుకోవడానికి దోహదం చేస్తుందని పేర్కొన్నాయి. చైనా తర్వాత స్మార్ట్‌ఫోన్లకు అతిపెద్ద మార్కెటుగా ఉన్న భారత్‌లో 5జీ రాక.. ఎన్నో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news