పాము కాటేసిందా…? అయితే ఇలా చేస్తే చాలు…!

-

ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 50 లక్షల మంది పాము కాటుకు గురవుతున్నారు. ఇండియా లో అయితే రెండు లక్షలని అంచనా.. మన దేశంలో 250 జాతుల పాములున్నప్పటకిీ వాటిలో 52 విష సర్పాలు ఉన్నాయి.వాటిలో 5 రకాలు పాములు అత్యంత విషపూరితమైనవి.అవి కాటు వేస్తే 3 గంటల్లో ప్రాణం పోతుంది. ప్రథమ చికిత్స చేస్తే ఆ 3 గంటల వ్యవధిలోనే చేయాలి, లేకపోతే పాము కరిచిన ఆ వ్యక్తి మనకు దక్కడు.

మొదటిగా కరిచిన పాము విషపూరితమైనదా,కాదా అని తెల్సుకోవాలంటే అది కరిచిన చోట ఎన్నిగాట్లున్నాయో చూడాలి. ఒకటి లేదా రెండు గాట్లు ఉంటే కరిచింది విషపు పాము అని, మూడు అంతకంటే ఎక్కువ గాట్లు ఉంటే అది విషరహిత పాము అని గుర్తించాలి. విషపు పాము కరిస్తే….కరిచిన చోట పాము విషం శరీరంలోకి వెళుతుంది. అక్కడి నుండి గుండెకు , గుండె నుండి అన్ని శరీరభాగాలకు చేరుతుంది.

ఇలా విషం అన్ని శరీరభాగాలకు చేరడానికి 3 గంటల సమయం పడుతుంది ఈలోగా చికిత్స అందకపోతే మనిషి బతికే అవకాశాలు ఉండవు. విషపు పాము కరిచిన వెంటనే కాటుకు పైన అంటే గుండె వైపుగా బలంగా తాడుతో కట్టాలి. సూదిలేని సిరంజీని తీసుకోని ఆ గాట్లలో ఓ గాటు దగ్గర పెట్టి రక్తాన్ని పిండాలి మొదటగా రక్తం కాస్త నలుపు రంగులో ఉంటుంది అంటే అది విషపూరితమైన రక్తం అని అర్థం.

ఇలా రెండు మూడు సార్లు రెండు గాట్ల వద్ద చేయాలి. ఇలా చేశాక మనిషి సృహలోకి వస్తాడు. నిజానికి పాము తన కొరల్లో ఉంచుకునే విషం 0.5 ML నుండి 2 ML వరకు మాత్రమే. హోమియోపతి మెడిసిన్ అయిన NAJA-200 ను అందుబాటు లో ఉండేలా చూసుకోవాలి. దీనిని పాము కరిచిన వ్యక్తి నాలుక పై 10 నిమిషాలకోసారి 3 సార్లు వేస్తే… పాము కరిచిన వ్యక్తి త్వరగా కోలుకుంటాడు. తర్వాత హాస్పిటల్ లో పూర్తి చికిత్స చేయించాలి .

Read more RELATED
Recommended to you

Latest news