పరుగులు పెడుతున్న పసిడి..!

-

స్థిరంగా ఉన్న పసిడి మరో సారి పైకి కదిలింది. దీనితో పసిడి ప్రియులకి ఇది బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి. ఈసారి బంగారం ధర రూ.50 వేలు దాటేసింది. అయితే గత కొన్ని రోజులుగా స్థిరంగా ఉన్న పసిడి భారీగా పెరగడం గమనార్హం.

అదే విధంగా వెండి ధరలు కూడా పెరిగి పోయాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. గురువారం బంగారం ధరలు ఎలా వున్నాయి అంటే… హైదరాబాద్ మార్కెట్‌ లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.540 పైకి కదిలింది.

దీంతో రేటు రూ.50,300కు ఎగసింది. అదే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర చూస్తే.. రూ.500 పెరుగుదలతో రూ.46,100కు ఎగసింది. ఇది ఇలా ఉండగా వెండి ధర భారీగా పెరిగింది. రూ.1,300 పైకి కదిలింది. దీంతో కేజీ వెండి ధర రూ.77,300కు ఎగసింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో మాత్రం బంగారం ధర తగ్గింది. 0.46 శాతం దిగొచ్చింది. దీంతో పసిడి రేటు ఔన్స్‌కు 1892 డాలర్లకు క్షీణించింది. ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు మొదలైన కారణాల వలన బంగారం పై ప్రభావం పడుతుంది.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news