రుణ గ్రహీతలకు గుడ్ న్యూస్…!

-

రుణ గ్రహీతలకు ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తాజాగా ఈ బ్యాంక్ ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనితో బ్యాంక్ రుణ గ్రహీతలకు కాస్త ఊరట కలుగనుంది. అంతే కాదు వాళ్లకి ఈఎంఐ భారం తగ్గనుంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే…. ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దీనితో కస్టమర్స్ కి కూడా ఊరట కలిగింది. ఈ బ్యాంక్ తాజాగా మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు MCLR ని తగ్గిస్తున్నట్టు చెప్పింది.

ఇలా చేయడం మూలంగా రుణ గ్రహీతలకు బెనిఫిట్ కలుగనుంది. ఇండస్ఇండ్ బ్యాంక్ ఎంసీఎల్ఆర్ రేటు లో 0.05 శాతం కోత విధించింది. దీనితో ఏడాది రేటు 8.6 శాతానికి దిగి వచ్చింది. అయితే తగ్గక ముందు ఈ రేటు 8.65 శాతంగా ఉండేది. ఇది ఇలా ఉండగా ఈ కొత్త రేటు ఫిబ్రవరి 22 నుంచే అమలు లోకి వచ్చింది. దీనితో బ్యాంక్ రుణ గ్రహీతలకు ఊరట కలుగుతుంది.

అంతే కాదండి లోన్ ఈఎంఐ చెల్లించే వారికి కూడా ప్రయోజనం కలుగొచ్చు. ఈఎంఐ భారం దిగిరావొచ్చు. అలానే హోమ్ లోన్స్, పర్సనల్ లోన్స్, ఇతర రుణాలపై రుణ రేట్లు బాగాతగ్గాయి. రేట్ల తగ్గింపుతో ఒక రోజు ఎంసీఎల్ఆర్ 8.25 శాతానికి, నెల రోజుల ఎంసీఎల్ఆర్ 8.3 శాతానికి, 3 నెలల ఎంసీఎల్ఆర్ 8.35 శాతానికి తగ్గింది. అలానే ఆరు నెలల ఎంసీఎల్ఆర్ 8.5 శాతానికి, ఏడాది ఎంసీఎల్ఆర్ 8.6 శాతానికి, మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 8.95 శాతానికి దిగొచ్చింది.

Read more RELATED
Recommended to you

Latest news