జీఎస్‌టీ చెల్లింపుదారులకు శుభవార్త…!

-

మీరు జీఎస్‌టీ కడుతున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక దీనికి సంబంధించి పూర్తిగా చూస్తే… కరోనా సెకండ్‌ వేవ్ అందర్నీ ఇబ్బందుల లోకి నెట్టేసింది. ఈ మహమ్మారి దేశ ఆర్థిక వ్యవస్థ పై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ నేపధ్యం లో వ్యాపారులక ఊరట కలిగించే నిర్ణయం కేంద్రం తీసుకుంది.

ఒకవేళ కనుక జీఎస్‌టీ రిటర్న్స్ దాఖలు ఆలస్యమైతే పడే వడ్డీ భారాన్ని తగ్గించింది కేంద్రం. దీని గురించి చూస్తే.. రూ.5 కోట్లకు పైగా టర్నోవర్ కలిగిన రిజిస్టర్డ్ పర్సన్స్ ట్యాక్స్ పేమెంట్ 15 రోజులలోపు ఆలస్యమైతే 9 శాతం వడ్డీ చెల్లించాలి. మార్చి, ఏప్రిల్, మే నెలలకు ఇది వర్తిస్తుంది.

అదే ఒకవేళ 15 రోజులు దాటితే 18 శాతం వడ్డీ పడుతుంది. ఒకవేళ కనుక రూ.5 కోట్ల వరకు టర్నోవర్ కలిగిన రిజిస్టర్డ్ పర్సన్స్‌కు అయితే ట్యాక్స్ పేమెంట్ 15 రోజులలోపు ఆలస్యమైతే ఎలాంటి వడ్డీ భారం పడదు అని చెప్పింది. ఆ తర్వాత 15 రోజులకు అయితే 9 శాతం వడ్డీ చెల్లించాలి. అది దాటినా చెల్లించకపోతే అప్పుడు 18 శాతం వడ్డీ పడుతుంది గమనించండి.

ఇది ఇలా ఉండగా ఏప్రిల్ నెలకు సంబంధించి ఫామ్ జీఎస్‌టీఆర్ 1 దాఖలు గడువును 15 రోజులు పొడించింది. 2020-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫామ్ జీఎస్‌టీఆర్ 4 దాఖలుకు మే 31 వరకు గడువు పొడిగించింది.

ఒకవేళ కనుక ఎవరైనా కంపొజిషన్ స్కీమ్ కనుక ఎంచుకుంటే….. తొలి 15 రోజులు ఎలాంటి వడ్డీ పడదు. ఒకవేళ 15 రోజులకు అయితే 9 శాతం, ఇంకా దాటితే 18 శాతం వడ్డీ పడుతుంది. ఇది ఇలా ఉంటే కొంత మందికి ఆలస్య రుసుమును కూడా మినహాయిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news