పీఎం జన్ ధన్ ఖాతా ఉంటే ఈ బెనిఫిట్స్‌ అన్నీ మీకే

-

దేశంలోని ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు వివిధ పథకాలను ప్రవేశపెడుతోంది. ఆ పథకాలలో ప్రధాన్ మంత్రి జన్ ధన్ యోజన (PMJDY) ఒకటి. ఈ పథకం కింద ఎవరైనా జీరో బ్యాలెన్స్ ఖాతాను తెరవడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు. దేశంలోని ప్రతి విభాగం బ్యాంకింగ్ వ్యవస్థకు అనుసంధానం అయ్యేలా ఈ పథకం ప్రత్యేకంగా ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. పీఎం జన్ ధన్ పథకం కింద 28 ఆగస్టు 2023 వరకు మొత్తం 50 కోట్ల కంటే ఎక్కువ ఖాతాలు తెరిచినట్లు కేంద్ర మంత్రిత్వశాఖ తెలిపింది.

దేశంలోని ప్రతి కుటుంబంలో ఒకరికైనా బ్యాంక్ అకౌంట్ ఉండాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించింది. దీని కింద మంచి బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే చాలా మంది ఇటీవల ఈ అకౌంట్ క్లోజ్ చేసుుంటున్నారు. దీంతో రూ. 2.30 లక్షల వరకు బెనిఫిట్ కోల్పోతున్నారు తెలుసా..? మీరు కూడా ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలనుకుంటే ఈ పథకంకు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

భారతదేశంలో నివసించే ఏ వ్యక్తి అయినా పీఎం జన్ ధన్ ఖాతాను తెరవవచ్చు. అయితే ఈ పథకం ముఖ్యంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న, ఇంకా బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించబడని వారి కోసం ప్రారంభించింది. మీరు జీరో బ్యాలెన్స్ లేకుండా ఈ ఖాతాను తెరవవచ్చు. ఈ ఖాతాను తెరవడానికి వయోపరిమితి లేదు.

అణగారిన వర్గాలకు బ్యాంకింగ్ సౌకర్యం కల్పించాలన్న ఉద్దేశంతో.. పేద ప్రజల ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం 2014లో తీసుకొచ్చిన స్కీమ్ పీఎం జన్ ధన్ యోజన (PMJDY). ఎక్కువగా గ్రామీణ ప్రాంత ప్రజలు మహిళలే ఈ స్కీం లబ్ధిదారులుగా ఉన్నారు. బ్యాంక్ అకౌంట్‌ను ఆధార్‌, మొబైల్ నంబర్‌తో అనుసంధానం చేశారు. ఇప్పటివరకు 50 కోట్ల మందికిపైగా అకౌంట్లు తెరిచారు. వీటిల్లో రూ. 2 లక్షల కోట్లకుపైగా నగదు డిపాజిట్ చేశారు. సగటున ఒక్కో ఖాతాలో రూ. 4076 నగదు ఉంది. ఈ జన్ ధన్ అకౌంట్లను ఇటీవల చాలా మంది మూసివేసేందుకు చూస్తున్నారు. వారు ఎన్నో బెనిఫిట్స్ కోల్పోయే ప్రమాదం ఉంది.

జన్ ధన్ అకౌంట్ జీరో బ్యాలెన్స్ అకౌంట్. అంటే కనీస బ్యాలెన్స్ మెయింటెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఖాతా తెరిచే ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభించింది కేంద్రం. ఈ స్కీం కింద చాలా మంది అకౌంట్లు తెరిచారు.

అయితే జన్ ధన్ అకౌంట్ ఉన్న బ్యాంకులోనే మరో అకౌంట్ ఉన్న వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇలా ఒకే బ్యాంకులో ఒకే ఆధార్‌తో రెండు అకౌంట్స్ ఉంటే ఆన్‌లైన్ లావాదేవీలు చేయలేరు. యోనో, ఎస్‌బీఐ వంటి వాటిల్లో లాగిన్‌కు అవకాశం ఉండదు. ఈ కారణంతోనే ఇటీవల జన్ ధన్ అకౌంట్లను క్లోజ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

జన్ ధన్ అకౌంట్ క్లోజ్ చేసుకోవడం వల్ల రూ. 2.30 లక్షల వరకు నష్టపోయే అవకాశముంది. జన్ ధన్ ఖాతా కలిగిన వాళ్లకు ఉచితంగానే రూపే డెబిట్ కార్డు అందిస్తారు. ఈ కార్డుపై రూ. 2 లక్షల వరకు యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఉంది. ఇంకా వీరికి రూ. 30 వేల వరకు బీమా వస్తుంది. అకౌంట్ ఉన్న వారు అకస్మాత్తుగా చనిపోతే.. వారి కుటుంబానికి ఈ డబ్బులొస్తాయి. ఇంకా ఇవి జీరో అకౌంట్లు. ఓవర్ డ్రాఫ్ పరిమితి రూ. 10 వేలు. అకౌంట్లో డబ్బుల్లేకున్నా రూ. 10 వేలు విత్‌డ్రా చేసుకోవచ్చు.

ఆధార్ కార్డ్ లింక్ చేసుకోని వాళ్లు ఈ బెనిఫిట్స్ పొందలేరు. ఇప్పటివరకు జన్ ధన్ అకౌంట్ తెరవకుంటే.. మొదట సమీప బ్యాంకుకు వెళ్లండి. జన్ ధన్ ఫారం ఫిల్ చేయాలి. మీ పేరు, మొబైల్ నంబర్, అడ్రస్, వ్యాపారం, ఉపాధి, వార్షికాదాయం ఆధారపడిన వారి సంఖ్య, నామినీ మొదలైనవి పూరించాలి. దీనికి పదేళ్ల కంటే ఎక్కువ వయసున్న వారు అర్హులు.

ఆధార్, పాస్ పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ వంటి జిరాక్స్ సమర్పించాలి. అకౌంట్ ఓపెనింగ్‌కు ఎలాంటి ఫీజు ఉండదు. యాక్సిడెంట్‌కు గురైతే.. క్లెయిమ్ కోసం క్లెయిమ్ ఫాం, డెత్ సర్టిఫికెట్, ప్రమాదం జరిగినట్లు FIR, పోస్ట్ మార్టం రిపోర్ట్, ఆధార్ వివరాలు సబ్మిట్ చేయాలి.

Read more RELATED
Recommended to you

Latest news