రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు కేంద్రం చర్యలు..

-

రామగుండం ఎరువుల కర్మాగారం తెలంగాణలోని పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఒక ముఖ్యమైన పారిశ్రామిక యూనిట్. ఇది గతంలో ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గా పనిచేసింది. నష్టాల కారణంగా 1999లో ఈ కర్మాగారం మూతపడింది దేశంలోనే యూరియా ఉత్పత్తిని పెంచి దిగుమతులను తగ్గించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రామగుండం ఎరువుల కర్మాగారాన్ని పునరుద్దించడానికి అనేక చర్యలు చేపట్టింది. మరి కేంద్రం తీసుకున్న చర్యలను తెలుసుకుందాం..

నూతన ఎరువుల విధానం : కేంద్ర ప్రభుత్వం 2012 నూతన ఎరువుల విధానం ప్రకటించింది ఈ విధానం యూరియా రంగంలో కొత్త పెట్టుబడుదల ప్రోత్సహించింది. మరియు దేశాన్ని యూరియా ఉత్పత్తిలో స్వలంబనం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విధానం కింద రామగుండం సహా 5 మూతపడిన ఎరువుల కర్మాగారాలు పునరుద్ధరణకు ప్రణాళికలు రూపొందించబడ్డాయి.

Central Government Initiatives for the Revival of Ramagundam Fertilizer Plant

రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ కోసం 2017 ఫిబ్రవరి 15న రామగుండం ఫెర్టిలైజేషన్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ అనే జాయింట్ వెంచర్ కంపెనీని ఏర్పాటు చేశారు. ఈ కంపెనీలో నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ మరియు ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్  26% వాటా ను, ఫెర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు 11% వాటా ను,  తెలంగాణ ప్రభుత్వం 11% వాటా, జిఏఐఎల్ ఇండియా లిమిటెడ్ కు 14.3% వాటా HTAS 11.7% వాటా భాగస్వాములుగా ఉన్నారు. ఈ జాయింట్ వెంచర్ ద్వారా గ్యాస్ అదారిత అమ్మోనియా, యూరియా యూనిట్ తయారు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. ఇది సంవత్సరానికి 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను ఉత్పత్తి చేస్తుంది.

రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ కర్మాగారం మూతపడిన తర్వాత,దానిని తెరిపించడానికి కేంద్ర ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది. ప్రత్యేకంగా రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణ ప్రాజెక్టును చేపట్టడానికి కేంద్ర ప్రభుత్వం రూ.6,120 కోట్ల పెట్టుబడులని పెట్టింది. ఈ నిధులు కర్మాగారం నిర్మాణం, ఆధునిక, సాంకేతికతను అమలు చేయడం సమర్థవంతమైన ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి, ఉపయోగించారు.ఈ పునరుద్ధరణతో RFCL ప్రస్తుతం యూరియా,అమోనియా వంటి ఎరువులను ఉత్పత్తి చేస్తుంది. ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రైతులకు ప్రయోజనం చేకూరుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news