30 నిమిషాల్లో రూ.50 లక్షల వరకు లోన్ ని ఇలా ఈజీగా పొందండి…!

-

బ్యాంక్ కస్టమర్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ ఫెడరల్ బ్యాంక్. దీని కోసం ఒక ప్రత్యేకమైన పోర్టల్ ని కూడా తీసుకు వచ్చింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, స్థూల, మధ్యతరహా పరిశ్రమలు సులభంగానే లోన్స్ పొందవచ్చని బ్యాంక్ అంది. ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే..

సులభంగానే రూ.50 లక్షల వరకు రుణం పొందొచ్చని ఫెడరల్ బ్యాంక్ చెప్పింది. అయితే ఈ లోన్ ని జస్ట్ 30 నిమిషాల్లోనే పొందొచ్చు. పైగా ఈ లోన్ ని తీసుకోవాలంటే ఎక్కడికీ వెళ్ళక్కర్లేదు. కేవలం ఆన్‌లైన్‌లోనే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్, బ్యాంక్ అకౌంట్ స్టేట్ ‌మెంట్ వంటివి అప్‌లోడ్ చేస్తే చాలు. అలానే ఆన్‌లైన్‌లోనే జీఎస్‌టీ వివరాల వెరిఫికేషన్ కూడా పూర్తవుతుందని బ్యాంక్ చెప్పింది.

ఈజీగా రుణ గ్రహీతలకు రూ.50 లక్షల వరకు రుణం పొందొచ్చని ఫెడరల్ బ్యాంక్ అంది. అదే విధంగా పోర్టల్ అల్‌గరిథమ్స్ ద్వారా కస్టమర్లు డేటాను విశ్లేషిస్తుందని ఐటీ రిటర్న్స్, జీఎస్‌టీ డేటా, బ్యాంక్ స్టేట్‌మెంట్, క్రెడిట్ బ్యూరో వంటి వాటి ద్వారా డేటాను తీసుకుని అనలైజ్ చేస్తుందని తెలిపింది.

డాక్యుమెంట్ల వెరిపికేషన్ తర్వాత సరైన లోన్ ప్రొడక్ట్ అందుబాటులోకి వస్తుందని, సెలెక్ట్ చేసుకుంటే బ్యాంక్ ఎంపిక చేస్తుందని బ్యాంక్ వివరించింది. నెక్స్ట్ బ్యాంక్ కి వెళ్లి డాక్యుమెంట్స్ ఇవ్వాలి. లోన్ డబ్బులు క్రెడిట్ అవుతాయి.

Read more RELATED
Recommended to you

Latest news