కెసిఆర్ ను అంటే ఊరుకోము..బిజేపి నేతలను అడ్డుకుంటాం : సబితా

-

కెసిఆర్ ను అంటే ఊరుకోము..బిజేపి నేతలను అడ్డుకుంటామని సబితా ఇంద్రారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. రైతుల మేలు కోరి తెలంగాణ లో అనేక రైతు సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటే కేంద్ర ప్రభుత్వం రైతుల నడ్డి విరుస్తుందని విమర్శించారు. మూడు నెలల కాలంలో 50 శాతం ఎరువుల ధరలు పెంచి రైతు పెట్టుబడిని పెద్ద ఎత్తున పెంచిన కేంద్రం వెంటనే ముఖ్యమంత్రి గారి అభ్యర్థన మేరకు ధరలు తగ్గించకుంటే అడుగడుగునా బీజేపీ నేతలను అడ్డుకుంటామని హెచ్చరించారు.

ఇప్పటికే వరుసగా పెట్రోల్,డీజల్ ధరలు పెంచుతూ పోతూ రైతులతో పాటు,సామాన్య ప్రజలను ఇబ్బందులు గురిచేస్తున్న కేంద్రం… గ్యాస్ ధర గుది బండ గా మారింది..నిత్యావసర ధరలు పెంచుకుంటూ పోతూ ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తుందని నిప్పులు చెరిగారు. రైతు కల్లాల దగ్గర వెళ్లి తెలంగాణ ప్రభుత్వం పంట కొనుగోలు చేస్తే నల్లా చట్టాలు తెచ్చి కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతుల ప్రాణాలు తీసిందని ఫైర్ అయ్యారు.

కేంద్రం చిల్లి గవ్వ ఇవ్వకున్న మూడేళ్ళ కాలంలో ప్రపంచంలో నే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం కట్టిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదన్నారు. మిషన్ కాకతీయ తో భూగర్భ జలాలు పెరిగి చెరువులు,కుంటలు బోరు బావులు పెద్ద ఎత్తున జలకళ సంతరించుకున్నాయని.. రైతును రాజు చేయటానికి,రాష్ట్రం లో సమస్యలు లేకుండా చేయటానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచిస్తుంటే..కేంద్రం ఎలాంటి సహకారం అందివ్వటం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news