ఏపీలో కరోనా కల్లోలం..!

-

దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత తీవ్ర రూపం దాల్చింది. ఎన్నో రాష్ట్రాలు ఈ మహమ్మారి బారిన పడి అతలాకుతలం అవుతున్నాయి. తెలుగు రాష్ట్రాలలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. గత కొన్నాళ్ల కితం వరకు కూడా ఓ మాదిరిగా ఉన్న కేసులు ఇప్పుడు ఊహించని రీతిలో పెరిగిపోతూ వస్తున్నాయి..మరణాలు కూడా అదే స్థాయిలో పెరిగిపోతున్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 24 గంటల్లో 15 వేల 384 శాంపిల్స్ ను పరీక్షించగా అందులో 136 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీనితో ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 4 వేల 126 కు చేరుకుంది. అయితే ఇక్క కాస్త ఊరటనిచ్చే అంశం ఏమిటంటే గత 24 గంటల్లో 72 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. గత కొన్ని రోజులలో ఇది కాస్త ఎక్కువే అని చెప్పాలి. మరి రానున్న రోజుల్లో కరోనా ఎలా ఉంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news