సీమాంధ్ర ప్రజలకు అండగా నేనుంటా…కేటీఆర్

-

తెలంగాణలో నివసించే సీమాంధ్ర ప్రజలకు అండగా నేనుంటా అంటూ మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆదివారం నిజాంపేటలో ‘మన హైదరాబాద్‌ – మనందరి హైదరాబాద్‌ ’  కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మట్లాడుతూ… ‘‘ఆంధ్రాలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పని ఏమీ చేయలేదు. మీరు కూడా మమ్మల్ని ఇబ్బంది పెట్టే పనులు చేయకండి. రెండు రాష్ట్రాల నాయకులు, పార్టీల మధ్య వైరుధ్యాలు ఉండటం సహజం… వాటిని ప్రజలు వ్యక్తులు, వ్యవస్థల మధ్య వైరుధ్యంగా చూడకూడదు. శంకుస్థాపన సమయంలో అమరావతికి రూ.100 కోట్లు ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది…కానీ  ప్రధాని మోదీ ఏమీ ప్రకటించకపోవడంతో మౌనంగా ఉండాల్సి వచ్చిందన్నారు.  ఢిల్లీలో జాతీయ పార్టీలయకులకు రాష్ట్రాల్లోని వారంటే చిన్నచూపు. ఇది అవసరమా మనకు. దశాబ్దాల కాలంలో ఎన్నడూ లేని విధంగా ఈ నాలుగేళ్లలో తెలంగాణలోని ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు అని గుర్తుచేశారు.

Read more RELATED
Recommended to you

Latest news