కరోనా విజృంభణ తారా స్థాయికి చేరుకుంటుంది.. ప్రతి రోజు వేల కొలదిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రభుత్వాల దగ్గర డబ్బు ఖాళీ అవుతుంది. ప్రజలు ఉద్యోగాలు లేక డబ్బులు లేక సతమతమవుతున్నారు. ఇలాంటి నేపద్యంలో ఓ స్కూలు యాజమాన్యం ఓ అద్భుతమైన పని చేసింది. తమ స్కూల్ లో చదువుతున్న పిల్లల తల్లిదండ్రులకు కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. రెండు నెలల స్కూల్ ఫీజుని మాఫీ చేసింది, దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. ప్రయాగ్రాజ్లోని ఏజేసీ పబ్లిక్ స్కూలులో 800 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. స్కూల్ యాజమాన్యం కరోనాతో పోరాడేందుకు ఫండ్ ఇవ్వాలని నిశ్చయించుకుంది. కానీ ఫండ్ ఇవ్వడంకంటే పిల్లల రెండు నెల ఫీజు మాఫీ చేయడం చాలా ఉపయోగకరం అని భావించి తమ స్కూల్ లో చదువుకుంటున్న 800 మంది పిల్లలకు స్కూల్ ఫీజు మాఫీ చేసింది. ఈ విధంగా ఇప్పటికే 8 లక్షల ఫీజు మాఫీ చేయబడిందని స్కూల్ యాజమాన్యం చెబుతుంది. ఈ పాఠశాల తీసుకున్న నిర్ణయాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరిన్ని స్కూళ్ళు ఇలాంటి నిర్ణయంతో ముందుకు రావాలని తల్లిదండ్రులు ఆకాంక్షిస్తున్నారు.
ఆ స్కూల్ విద్యార్థులకు ఫీజులు మాఫీ…!
By anurag s
-
Previous article
Next article
Read more RELATEDRecommended to you
అవినీతి, ఉగ్రవాదం, నక్సలిజం, విభజనవాదం పెరగాడినికి కారణం కాంగ్రెస్సే :రాజస్థాన్ సీఎం
అవినీతి అనేది కాంగ్రెస్ డీఎన్ఏలోనే ఉందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్...
Ganesh -
అబద్ధాలు ఆడటంలో బాబుకు మించిన వారు ఎవరూ లేరు :లక్షీపార్వతి
జనసేస చీఫ్ పవన్ కల్యాణ్ కపటం లేని మంచి మనిషి అంటూ...
Ganesh -
IPL 2024 : భారీ స్కోర్ చేసిన డిల్లీ… రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే?
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 17వ సీజన్ లో భాగంగా ఈరోజు రాజస్థాన్...
Ganesh -