ఏపీలో ఘోర రైలు ప్రమాదం..!

-

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం సూరారెడ్డి పాలెం దగ్గర గత అర్ధరాత్రి ఘోర రైలు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి చెన్నై వెళ్తున్న గూడ్సు రైలు నుంచి 3 డీజిల్ ట్యాంకర్లు ఒక్కసారిగా కిందపడ్డాయి. ట్యాంకర్లు కింద పడిపోవటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు ట్యాంకర్లను రైలు నుంచి వేరు చేసి అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటల్ని ఆర్పేశారు. ప్రమాదంలో మూడు డీజిల్ ట్యాంకర్లు అగ్నికి ఆహుతయ్యాయి.

ఈ ప్రమాదంలో 80 లక్షల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. అలాగే రైల్వే ట్రాక్‌ దాదాపు 200 మీటర్ల మేర ధ్వంసమైందని అధికారులు తెలిపారు. మంటలు సమయానికి ఆర్పేయడంతో సరిపోయింది. లేకపోతే మిగిలిన బోగీలకు కూడా మంటలు అంటుకునేవని అధికారులు చెప్పారు. భారీ ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ట్రాక్ కుంగిపోవడం వల్లే ప్రమాదం సంభవించినట్టు అధికారులు స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news