500 కోట్ల స్కామ్..! పోలీసులనే టోకిరి కొట్టించాడు..! చివరికి భార్యే హత్య చేసింది..!

-

christi prabhakaran story revealed by hyderabad police
christi prabhakaran story revealed by hyderabad police

ఇతను ఓ మేధావి.. కుంభకోణం చేయడంలో ఎక్స్ పార్ట్. దాదాపుగా 500 కోట్ల కుంభకోణం చేశాడు, పాపాలు పండి పక్షవాతం వచ్చి మంచాన పడ్డాడు. మధ్యలో భార్యను కూడా మోసం చేశాడు, తప్పు ఈయన చేస్తే శిక్ష భార్యకు పడింది. మనస్తాపం చెందిన భార్య ఆయనను హత్య చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విస్తుపోయే విషయాలు బయటపెట్టారు. వివరాల్లోకి వెళితే.. ఆయన పేరు ప్రభాకరన్ అలియాస్ క్రిస్టీ (55), క్రిస్టీ తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాడు. క్రిస్టీ 2012 లో తమిళనాడు లో పోలీసులు మనీ బ్యాక్ పాలసీ రాకెట్ లో అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో భాగంగా క్రిస్టీ అప్పటికే 500 కోట్ల స్కామ్ చేసిన ముద్దాయి. సాక్ష్యాలు దొరకడంతో కృస్టీని 2012 లో అరెస్ట్ చేశారు. కాగా 8 నెలల తరువాత కృస్టీ కి బెయిల్ దొరికి బెయిల్ పై విడుదలయ్యాడు. కేసులో భాగంగా 2013 లో క్రిస్టీ భార్యను కూడా సీఐ‌డీ పోలీసులు విచారణ చేసి అరెస్ట్ చేశారు. కానీ క్రిస్టీ భార్య సుకన్యకు బెయిల్ దొరకలేదు. దాంతో ఆమె 5 సంవత్సరాల జైల్ శిక్ష అనుభవించింది.

ఆమె అరెస్ట్ అవ్వగానే క్రిస్టీ తమిళనాడు నుండి హైదరబాద్ లోని మోలాలికి వచ్చి తలదాచుకుంటున్నాడు. క్రిస్టీ భార్యకు శిక్ష గడువు ముగిసి ఇంటికి తిరిగి వచ్చేసరికి క్రిస్టీ జాడ దొరకలేదు. చిత్తూరు లోని తమ చుట్టాల ఇంట్లో క్రిస్టి భార్య నివాసముంటుంది. అలా క్రిస్టీ జాడ వెతకగా ఆమెకి మౌలాలి లో క్రిస్టీ ఉంటునట్టు సమాచారం తెలిసింది. భార్య క్రిస్టీ ఇంటికి చేరుకుంది క్రిస్టీ అప్పటికే పక్షపాతంతో బాధపడుతున్నాడు, తిరిగి భార్యతో నివసించేందుకు నిరాకరించాడు. దాంతో మనస్తాపం చెందిన ఆమె కృస్టీని ఈ నెల 23న రాతి సమయం చూసుకొని దిండుతో నులిమి హత్య చేసింది. పోలీసులు విచారించగా, తానే ఈ హత్య చేసినట్టు సుకన్య అంగీకరించింది. ప్రస్తుతం ఆమెను రిమాండ్ కు తరలించామని మల్కాజిగిరి పోలీసు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news