లతా మంగేష్క‌ర్ బిల్డింగ్ సీల్డ్ .. కార‌ణం ఇదే..!

-

క‌రోనా మహమ్మారి పిల్ల‌ల నుంచి మొద‌లు పెద్ద‌ల వ‌ర‌కు ఎవ్వ‌రినీ వ‌ద‌లడం లేదు. పేద ధ‌ని అన్న బేధం లేకుండా అంద‌రూ వైర‌స్‌బారిన ప‌డుతున్నారు. అయితే వృద్ధులు, రోగుల‌పై క‌రోనా ఎఫెక్ట్ మ‌రింత ఎక్కువ‌గా ఉండ‌డంతో ముందస్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ గాయని లతా మంగేష్కర్ నివసిస్తున్న‌ భవనానికి బీఎంసీ సీల్ వేయాల‌ని నిర్ణ‌యం తీసుకుంది.

దీంతో మంగేష్క‌ర్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. తాము ఉంటున్న ప్రభుకుంజ్ భ‌వ‌నంలో వృద్ధులు ఎక్కువ‌గా ఉండ‌డంతో భ‌వ‌నం సీల్ చేయ‌నున్న‌ట్టు కాల్ వ‌చ్చింద‌ని ఆమె తెలిపారు. భ‌వ‌నంలో ఉన్న వారంతా వ్యాధి విష‌యంలో అప్ర‌మ‌త్తంగానే ఉంటున్నారని, దేవుని ద‌య‌, అభిమానుల ఆశీర్వాదం వ‌ల‌న మా కుటుంబం కూడా క్షేమంగా ఉంద‌ని ల‌తా పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news