నన్ను పిచ్చి కుక్క అంటున్నారు.. వారి భాగోతాలు బయటపెడతా..?

-

వైసీపీ ప్రభుత్వం పై ఎప్పటికప్పుడు ఎన్నో సంచలన విమర్శలు చేస్తూ ఆంధ్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిపోతున్నారు వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు. ఇటీవలే సీఎం ఢిల్లీ పర్యటన పై మీడియాతో మాట్లాడిన నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. హోంమంత్రితో రాష్ట్ర నిధుల గురించి మాట్లాడడం ఆశ్చర్యం గా ఉంది అంటూ వ్యాఖ్యానించారు. తాను రాష్ట్రమంతా తిరుగుతానని ఎవరేం చేస్తారో చూస్తాను అంటూ సవాల్ విసిరారు.

అయితే వైసీపీ నేతలు అందరూ తనను పిచ్చికుక్క అని తిడుతూ ఏకంగా బెదిరింపులకు పాల్పడుతున్నారని… ఒకవేళ తన బాగోతాలను బయట పెడితే వారి బాగోతాలు బయట పడిపోతాయి అంటూ హెచ్చరించారు రఘురామకృష్ణంరాజు. తాను ఎవరి బొమ్మ పెట్టుకుని గెలవలేదని.. ప్రజలు తన ముఖం చూసే ఓటేశారు అంటూ మరోసారి వ్యాఖ్యానించారు రఘురామకృష్ణంరాజు. తనకున్న సెక్యూరిటీని కూడా తొలగించేందుకు ఎంతోమంది ప్రయత్నాలు చేస్తున్నారు అంటూ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news