తెలంగాణ కరోనా అప్‌డేట్.. ఈరోజు ఎన్నంటే ?

-

తెలంగాణాలో కాస్త తగ్గినట్టుగా కనిపిస్తున్నా కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. ఈ మధ్య ఏ రోజూ 2 వేలకు తక్కువగా కరోనా కేసులు నమోదు కావడం లేదు. మొన్న బాగా తగ్గిన కరోనా కేసుల నమోదు నిన్న మళ్ళీ పెరిగింది. తాజాగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం నిన్న 2,154 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,04,748 కేసులు నమోదు అయ్యాయి. ఇక నిన్న కరోనాతో 8 మంది మరణించారు. ఇప్పటి వరకు 1189 మంది కరోనాతో మరణించారు. ఇక తెలంగాణా రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 26,551 గా ఉన్నాయి.

ఇక ఇప్పటి వరకు తెలంగాణాలో 1,77,008 మంది కరోనా బారిన పడి కోలుకున్నారు. నిన్న ఒక్క రోజే 2,239 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తెలంగాణాలో రికవరీ రేటు 86.45 % శాతంగా ఉంది. ఇండియా రికవరీ రేటు 84.9 % శాతంగా ఉంది. తెలంగాణాలో మరణాలు 0.58 %గా ఉన్నాయి. రాష్ట్రంలో నిన్న 54,277 పరీక్షలు చేస్తే ఇప్పటి వరకు 33,46,472 పరీక్షలు చేసారు. ఇక ఎప్పటి లాగానే జీహెచ్ఎంసీ పరిధిలో భారీగా అంటే 292 కేసులు నమోదయ్యాయి.

Read more RELATED
Recommended to you

Latest news