మాదాపూర్ లో ఫెరారీ కార్ బీభత్సం.. రోడ్డు మీద వెళ్తోన్న వ్యక్తి మృతి !

-

మాదాపూర్ లో ఫెరారీ కారు భీభత్సం సృష్టించింది. జూబ్లీ హిల్స్ నుండి మాదాపూర్ వైపు వేగంగా వెళుతున్న ఫెర్రారీ కార్ . ఒక్కసారిగా అదుపుతప్పి జనంపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడి కక్కడే మృతి చెందగా మరో ముగ్గురు గాయపడ్డారు. విషయం తెలుసుకుని స్పాట్ కి వచ్చిన పోలీసులు గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మితిమీరిన వేగం వల్లే ప్రమాదం జరిగిందని గుర్తించారు.

మృతుడి పేరు యేసు బాబు కాగా మాదాపూర్ లోని గుట్టల బేగంపేట్ లో వాచ్ మెన్ గా పనిచేస్తున్నట్టు గుర్తించారు. అతని వయసు 52 సంవత్సరాలని, ఈస్ట్ గోదావరి కి చెందిన వ్యక్తని గుర్తించారు. ఇక మిగిలిన ముగ్గురిని హాస్పిటల్ కి తరలించారు. కారు ఆక్సిడెంట్ చేసిన వ్యక్తి ని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని పోలీస్ స్టేషన్ కి తరలించారు. బలవంతంగా మృతదేహాన్ని పోలీసులు తరలిస్తున్న క్రమంలో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమకు న్యాయం చేశాకనే అక్కడి నుండి బాడీ తీయాలని వారు ధర్నాకి దిగారు.

Read more RELATED
Recommended to you

Latest news