స్థానిక సంస్థల ఎన్నికలకు కసరత్తు మొదలెట్టిన ఎస్ఈసీ

-

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహాణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. ఈ నెల 28న రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ భేటీ కానున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలు సడలించడంతో ఎన్నికలు నిర్వహణపై పార్టీల అభిప్రాయం కోరేందుకు ఈ భేటీ నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. ప్రతిపక్షాలు గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి కొత్తగా మళ్లీ ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాయి.

అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలు చేయించిందని గతంలోనే ఎస్ఈసీకి ప్రతిపక్షాల ఫిర్యాదుల నేపధ్యంలో ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఎస్ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న అంశంపై ఆసక్తి నెలకొంది. గతంలో మార్చి 7వ తేదీన స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసారు. అయితే మార్చి 15వ తేదీన కరోనా కారణంగా ఎన్నికలను వాయిదా వేశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతోండగా స్థానిక ఎన్నికలు వాయిదా పడ్డ్డాయి. ఈర్లోపే 2129 ఎంపీటీసీ, 125 జడ్పీటీసీ స్థానాల ఏకగ్రీవం అయ్యాయి. దీంతో ఆ ఏకగ్రీవాలను రద్దు చేయాలని ప్రతిపక్షాల డిమాండ్ చేస్తున్నాయి. అధికార పార్టీ బలవంతపు ఏకగ్రీవాలు చేయించిందని గతంలోనే ఎస్ఈసీకి ప్రతిపక్షాల ఫిర్యాదులు చేసిన నేపధ్యంలో ఈ విషయం ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news