బ్రేకింగ్: ప్రగతి భవన్ ముందు రైతు కుటుంబం ఆత్మహత్యాయత్నం

-

ప్రగతి భవన్ ముందు అలజడి రేగింది. ఒక రైతు కుటుంబం ప్రగతి భవన్ ముందు ఆత్మహత్యకు దిగడం సంచలనంగా మారింది. పోలీసులు అన్యాయం చేసారని ప్రగతి భవన్ ముందు ఆవేదన వ్యక్తం చేసాడు. శామీర్ పెట్ మండలం కొత్తూరు గ్రామంలో తమ భూమిని వేరే వారికి కట్టబెట్టారు అని ఆరోపణలు చేసాడు. పోలీసులు తమ కుటుంబానికి అన్యాయం చేసారని ఆరోపించాడు.

ఒంటి మీద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన అక్కడి పోలీసులు రైతు భిక్షపతిపై నీళ్ళు పోశారు. అతని భార్య బుచ్చమ్మ, రైతు భిక్షపతిని అరెస్ట్ చేసారు పోలీసులు. తమకు న్యాయం చేయకపోతే తమకు ఆత్మహత్యే శరణ్యం అని వారు ఆవేదన వ్యక్తం చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news