ఇట్స్ అఫీషియల్ : చత్రపతి బెల్లంకొండ బాలీవుడ్ రీమేక్, వినాయక్ దర్శకుడిగా

-

అనుకున్నట్లే అయింది ముందు నుంచి ప్రచారం జరుగుతున్నట్టే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అది కూడా ప్రభాస్ కి మాస్ ఇమేజ్ తెచ్చిపెట్టిన చత్రపతి సినిమా ద్వారా. పెన్ స్టూడియోస్ నిర్మాణంలో సాయి శ్రీనివాస్ తేజ్ హీరోగా ఈ రీమేక్ సినిమా మా తెరకెక్కనున్నట్లు కొద్దిసేపటి క్రితం అధికారికంగా ప్రకటించారు. 2005 సంవత్సరం లో ప్రభాస్ హీరోగా శ్రియ శరణ్ హీరోయిన్ గా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆరోజుల్లో సంచలన విజయం సాధించింది.

ఆ సినిమాని ఇప్పుడు బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి రెడీ అయ్యాడు. అయితే టాలీవుడ్ లో ఈయన్ని వీవీ వినాయక లాంచ్ చేశాడన్న సంగతి తెలిసిందే. అల్లుడు శీను సినిమా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వినాయక్ తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఇప్పుడు కూడా ఆయనే బెల్లంకొండని చత్రపతి సినిమా రీమేక్ తో బాలీవుడ్ కి పరిచయం చేస్తున్నాడు. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా మా హీరో దర్శకుడు నిర్మాత ల పేర్లు బయటకు వచ్చిన వేరే విషయాలు బయటికి రాలేదు త్వరలోనే దీనికి సంబంధించిన అన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం కనిపిస్తోంది

Read more RELATED
Recommended to you

Latest news