డాక్టర్ లు చనిపోయాడని మార్చరీకి పంపితే.. లేచి బయటకొచ్చాడు !

-

ఇలాంటి వార్తలు మనం వింటూనే ఉంటాం. చనిపోయాడని స్మశానానికి తీసుకు వెళితే అక్కడ కూడా లేచి కూర్చున్న వార్తలు వింటూనే ఉంటాం.. ఇప్పుడు కూడా అలంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. కెన్యాలోని కెరిచోకు చెందిన పీటర్ కిగెన్ అనే 32 ఏళ్ల వ్యక్తి తన ఇంటి వద్ద కుప్ప కూలిపోయాడు. దీంతో ఆయన్ని అత్యవసర చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. ఈ సమయంలో ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. అయితే ఆయన్ని మార్చురీకి తరలించారు.

మూడు గంటల తర్వాత, కిగెన్ ని ఎంబామింగ్ చేసేందుకు సిద్ధమవుతున్నప్పుడు మృతదేహంలో తిరిగి ప్రాణం వచ్చిందా అన్నట్టు అయన లేఛి కూర్చున్నాడు. ఎంబామింగ్ ప్రక్రియలో భాగంగా తన కుడి కాలుని కోయడాడానికి సిద్దం అయినప్పుడ, కిగెన్ కేకలు వేశాడు. ఈ దెబ్బకు ముందు ఎంబామింగ్ చేసేవాళ్ళు వనికిపోయినా తరువాత విష్యం తెలుసుకుని ఆశ్చర్యపోయారు. తన నమ్మశక్యం కాని ‘పునర్జన్మ’ తర్వాత పీటర్ కిగెన్ సజీవంగా ఉన్నందుకు సంతోషంగా ఉన్నానని చెప్పాడు. ఇక తన జీవితాన్ని సువార్తకి(క్రైస్తవ మత ప్రచారానికి) అంకితం చేయాలని భావిస్తున్నట్లు ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news