త్వరగా రాజధాని మార్చేయండి.. ద్వేషం పెంచుకున్నారు !

-

ఈరోజు ఏపీ సెక్రటేరీయేట్ లో సచివాలయ ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్ జరిగింది. స్పోర్ట్స్ మీట్లో ముఖ్య అతిధిగా ప్రభుత్వ సలహా దారు సజ్జల రామకృష్ణా రెడ్డి  పాల్గొన్నారు. ఉద్యోగుల స్పోర్ట్స్ మీట్లో కొత్త రాజధానిపై ఆసక్తికర చర్చ జరిగింది. ఈ క్రమంలో కొత్త రాజధానిలో ఉద్యోగులకు అవసరమైన అన్ని రకాల వసతులు ఏర్పాటు చేస్తామని సజ్జల పేర్కొన్నారు. కొత్త రాజధానిలో ఉద్యోగుల కోసం అన్ని రకాల వసతులతో కూడిన స్పోర్ట్స్ క్లబ్ ఏర్పాటు చేస్తామని సజ్జల పేర్కొన్నారు.

అమరావతి సచివాలయంలో ఉద్యోగుల కోసం ఏమేం  వసతులు ఏమున్నాయో నాకు తెలీదు.. కొత్త రాజధానిలో అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామని సజ్జల హామీ ఇచ్చారు. అయితే వీలైనంత త్వరగా తమను కొత్త రాజధానికి తీసుకెళ్లాలని సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి కోరారు. స్పోర్ట్స్ మీట్ నిర్వహాణ కోసం టెంట్ వేయాలన్నా ఇక్కడి ప్రజలు సహకరించడం లేదని, ఇక్కడి ప్రజలు తమపై ద్వేషం పెంచుకున్నారని అందుకే త్వరగా కొత్త రాజధానికి తీసుకెళ్లాలని సజ్జలను వెంకట్రామిరెడ్డి కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news