బ్యాడ్మింటన్ స్టార్లు ఒక్కటయ్యారు..!

-

Badminton players Saina and Kashyap got married

ఏంటో… ఈ మధ్య సెలబ్రిటీలంతా పెళ్లి బాట పడుతున్నారు. సోనమ్ కపూర్, దీపికా పదుకొణె, ప్రియాంకా చోప్రా.. ముకేశ్ అంబానీ కూతురు ఈషా పెళ్లి.. ఇప్పుడు బ్యాడ్మింటన్ స్టార్లు సైనా నెహ్వాల్, పారుపల్లి కశ్యప్ ఇద్దరు ఒక్కటయ్యారు. చాలా సింపుల్ గా వారి వివాహ వేడుక జరిగింది. ఇద్దరూ రింగులు, దండలు మార్చుకొని ఒక్కటయ్యారు. వాళ్లు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. వాళ్ల పెళ్లికి సంబంధించిన ఫోటోలను తమ ట్విట్టర్ ఖాతాల్లో షేర్ చేసింది జంట. చాలారోజుల నుంచి వీళ్లిద్దరి మధ్య ప్రేమాయణం నడుస్తున్నప్పటికీ.. ఇటీవలే వీళ్ల ప్రేమ విషయం ప్రపంచానికి తెలిసింది. తర్వాత శుక్రవారం ఇద్దరూ ఒక్కటయ్యారు. ఇక.. డిసెంబర్ 16న అంటే ఆదివారం సాయంత్రం మాత్రం దూమ్ దామ్ పార్టీ ఇవ్వనుందట ఈ జంట. పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ వేడుకకు హాజరవనున్నట్టు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news