ఏమైంది బామ్మా..! 62 ఏళ్ల బామ్మ‌ జీపు నడుపుకుంటు ఢిల్లీకి

-

చ‌లిని లెక్క చేయ‌కుండా  62 ఏళ్ల బామ్మ‌ జీపు నడుపుకుంటు ఢిల్లీ చేరింది. చలిని వృద్ధులు తట్టుకోలేరని జాగ్రత్తగా చూసుకుంటు వారి ఆరోగ్యాన్ని కాపాడుతుంటారు. ఎన్నడు లేని విధంగా ఈ సారి చల్లి మరీ తీవ్రంగా ఉంది. అయితే ఇప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. కేంద్ర పభుత్వం తీసుకువచిచ్చన మూడు నూతన వ్యయసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ గత 2 నెలలుగా ఢిల్లిలో రైతన్నలు ధర్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు అప్పుడు చర్చలంటూ కాలం వెల్లదీస్తున్నారు. చలి, ఆకలిని లెక్కచేయకుండ వారు ధర్నాలు, రాస్తారోకోల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో వారికి మద్దతుగా 62 ఏళ్ల వృద్ధురాలు తానే స్వయంగా జీపు నడుపుకుంటు ఢిల్లికి వచ్చి ధర్నాలో పాల్గొంది.

 

old women supports farmers strike 62 ఏళ్ల బామ్మ‌ జీపు నడుపుకుంటు

62 ఏళ్ల బామ్మ జీపు నడుపుకుంటు ఢిల్లీకి

రోజురోజుకు వివిధ పట్టణాలు, ప్రాంతాల నుంచి కాలినడక, బస్సులు, లారీల్లో మహిళ రైతులు సైతం ధర్నాలో పాలు పంచుకుంటున్నారు. ఈ క్రమంలో వారిని ఢిల్లీలోకి రానివ్వకుండా కేంద్రం ప్రవేశ ద్వారాలను మూసేసింది. సరిహద్దులైన తిక్రీ, సింఘు ప్రాంతాలలోనే వారిని ఆపేసింది. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌ల నుంచి వచ్చిన వేలాది రైతులు సరిహద్దుల వద్దనే శిబిరాలు ఏర్పాటు చేసుకొని నిరసనలు తెలుపుతున్నారు. రైతుపోరులో భాగంగా దాదాపుగా 25 మంది రైతులు, గుండెపోటు, ప్రమాదాలు, అస్వస్థత తదితర కారణాలతో మృత్యువాత పడ్డారు.

నినాదాలు చేస్తూ..

ఈ క్రమంలో 62 ఏళ్ల మంజీత్‌ కౌర్‌ అనే వృద్ధు్ధరాలు పంజాబ్‌లోని పటియాలా నుంచి రైతుల నిరసన ప్రాంతమైన సింఘూ వరకు 257 కి.మీ. దూరం తానే స్వయంగా జీపును నడుపుకుంటూ ధర్నాలో పాల్గొని రైతన్నలకు మద్ధతు తెలిపారు. జీపులో మరో ఐదారు మహిళలను తీసుకుని రయ్‌రయ్‌ మంటూ «ఢిల్లికి దూసుకొచ్చారు. జీపులో నినాదాలు చేస్తు మహిళలు రావడంతో సినిమాల్లో ఓ చేజింగ్‌ తలపించింది.ధర్నాలో పాల్గొనేందుకు వచ్చిన మంజీత్‌ దేశవ్యాప్తంగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.ఆమెను చూసిన మరికొందరు మహిళలు సైతం ఢిల్లిదారి పడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news