రాజా సింగ్ మీద వైసీపీ ఫైర్.. రాజీనామా సవాళ్లు !

-

తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రనాద్ గా భావించే రాజా సింగ్ మీద ఇప్పుడు ఏపీలోని అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. బీజెపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై ఏపి రాష్ట్ర ముస్లిం మైనారిటీ అధ్యక్షుడు, వైసిపి నాయకుడు రజాక్ సవాల్విసిరారు. శ్రీశైలం ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి నన్ను అడ్డుపెట్టుకుని అక్రమాలకు పాడ్డుతున్నారనే ఆరోణ నిరుపించగలవా ? ఇది నా ఓపెన్ చాలెంజ్ అంటూ రజాక్ విమర్శించారు.

ఎమ్మెల్యే చక్రపాణి రెడ్డి నా ద్వారా అక్రమాలకు పాల్పడ్డారని నిరూపించలేకపోతే రాజాసింగ్ మీరు రాజీనామా చేయగలరా ? అని ప్రశ్నించిన ఆయన ఒక వేళ నిరూపిస్తే మా ఎమ్మెల్యే రాజీనామా చేసేందు సిద్దం అని రజాక్ సవాల్ విసిరారు. మల్లికార్జున స్వామి వారిని ఏ మతం వారైన కొలవచ్చు కొలవకుడదని మీ మత గ్రంధంలో రాశారా ? రాజ్యంలో రాశారా ? అని రజాక్ ప్రశ్నించారు. శ్రీ శైలం దేవస్థానంలో నా పేరు మీద పావలా పని కూడ నేను చేయ లేదన్న ఆయన మా ముస్లిం సోదరులకు కూడ దేవస్థానంలో ఎటువంటి కాంట్రాక్టు ఇప్పించ లేదని రజాక్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news