రజనీ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. నేడు డిశ్చార్జ్ ?

-

48 గంటలుగా అపోలో ఆస్పత్రిలోనే రజనీ కాంత్ చికిత్స పొందుతున్నారు. హై బీపీ సమస్యతో అపోలో ఆస్పత్రిలో చేరారు సూపర్ స్టార్ రజనీకాంత్. రజనీకి పూర్తి స్థాయిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అపోలో వైద్యులు, ఆయనకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవంటున్నారు వైద్యులు. రాత్రంతా రజనీ బిపి లెవెల్స్ మానిటరింగ్ చేసిన వైద్యులు, అంతా ఒకే అనుకుంటే ఇవాళ డిశ్చార్జ్ చేస్తామని అపోలో వైద్యులు చెబుతున్నారు.

ఒక వేళ అదే జరిగితే రజనీ అభిమానులకి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఆయన అనారోగ్యానికి గురయితే పార్టీ ప్రకటన లేట్ అవుతుంది అని వారంతా టెన్షన్ పడ్డారు. ఈ రోజు డిశ్చార్జ్ అయితే మరో నాలుగు రోజుల సమయం ఉంటుందని సో ఆయన పార్టీ ప్రకటన చేయడం ఖాయమని అంటున్నారు. ఇక ఈరోజు ఎన్ని గంటలకు డిశ్చార్జ్ చేస్తారు అనేది మాత్రం ఆసక్తికరంగా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news