అప్పుడు మహానటి సావిత్రి.. ఇప్పుడు జమున.. తమన్నా ముఖ్య పాత్రలో..

-

మహానటి సావిత్రి జీవితం వెండితెర మీదకి వచ్చి మంచి విజయం అందుకుంది. సావిత్రి జీవితాన్ని మరికొన్ని తరాలు గుర్తుండిపోయేలా చేసాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అదలా ఉంచితే, తాజాగా జమున గారి జీవితం తెరమీదకి రాబోతుంది. దేవినేని అనే టైటిల్ తో సినిమా తెరకెక్కించి విడుదల చేసిన శివనాగు నర్రా ఈ జీవిత కథకి శ్రీకారం చుట్టబోతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం స్క్రిప్టు దశలో ఉందనీ, ఈ మేరకు జమున గారిని శివగారు సంప్రదించాడని అంటున్నారు.

జమున గారి జీవితాన్ని తెరపై చూపించడానికి తమన్నా భాటియా వస్తున్నారట. తమన్నా అయితే బాగుంటుందని దర్శకుడు ఫీల్ అయ్యాడట. జమున గారు ఎన్నో మంచి మంచి సినిమాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్నార్, క్రిష్ణ, శోభన్ బాబు లతో కలిసి నటించారు. ప్రస్తుతానికి ఈ సినిమా విషయమై అధికారిక ప్రకటన రానప్పటికీ, మరికొద్ది రోజుల్లో రానుందని అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి. ఆహా కోసం వెబ్ సిరీస్ చేసిన తమన్నా, సీటీమార్ సినిమాతో బిజీగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news