పవన్ కల్యాణ్ అంటే మోడీకి ఎంతో అభిమానం.. రాష్ట్రానికి అధిపతి ఆయనే !

-

ఈ రాష్ట్రానికి అధిపతిగా.. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్  కావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న తిరుపతిలో బీజేపీ, జనసేన పార్టీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ క్రమంలోనే ఈ రాష్ట్రానికి కాబోయే అధిపతి పవన్ కళ్యాణే కావాలని కోరుకుంటున్నానని సోము వీర్రాజున్నారు.

పవన్ కళ్యాణ్ కు సముచిత గౌరవం ఇవ్వాలని నేరుగా ప్రధాని నరేంద్ర మోదీనే తనకు సూచించారన్నారు సోము వీర్రాజు.. పవన్ కల్యాణ్ అంటే మోదీకి ఎంతో అభిమానమని 2014లోనే నాతో మోదీ ఈ విషయం చెప్పారని అన్నారు. పవన్ కళ్యాణ్ ను మనం గౌరవంగా చూసుకోవాలి అన్నారని ఆయన అన్నారు. ఈ అంశాన్ని భాజపా నేతలు,  కార్యకర్తలు ట్రూ స్పిరిట్ తో తీసుకోవాలన్నారు. గతంలో నాటుసారాను గ్రామాల్లోనే కాసేవారన్న ఆయన ఇప్పుడు బూమ్ బూమ్ కంపెనీ లతో సీఎం ఏ పంపిణీ చేస్తున్నారని అన్నారు.  

Read more RELATED
Recommended to you

Latest news