భారీగా ముంబై రైల్వే స్టేషన్ లకు వలస కూలీలు.. భయపడాల్సిందేమీ లేదంటున్న అధికారులు !

-

ముంబైని తీవ్రంగా ప్రభావితం చేసిన కరోనావైరస్ కేసుల నేపథ్యంలో  కుర్లాలోని లోక్మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టిటి) వద్దకు భారీ సంఖ్యలో వలస కార్మికులు చేరుకున్నారు. ఈ ప్రాంతం నుంచి వెలువడుతున్న విజువల్స్ ప్రకారం టెర్మినస్ వద్ద భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడారు. మహారాష్ట్రలో పూర్తి లాక్ డౌన్ విధించే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్న తరుణంలో, గత వారాంతం నుండి ముంబైలోని అన్ని రైల్వే స్టేషన్ లలో, రైళ్లలో ప్రయాణికుల రద్దీ కనిపించింది.

రద్దీ పెరగడంతో కుర్లా స్టేషన్ వలస పోలీసులు కఠినంగా వ్యవహరించాల్సి వస్తోంది. కొంతకాలం క్రితం, పోలీసులు కూడా ప్రజలను తొలగించాల్సి వచ్చింది. ఎల్‌టిటిలోని సెంట్రల్ రైల్వే సిబ్బంది సోమవారం మాట్లాడుతూ, గత రెండు రోజుల నుంచి, ముంబైలోని సబర్బన్ స్టేషన్, రైళ్లలోకి వచ్చే ప్రయాణికులలో గణనీయమైన పెరుగుదలను ఉందని చెబుతున్నారు. అయితే ఈ రద్దీ అసాధారణమైనది కాదు, ఇది సాధారణ వేసవి సీజన్ రష్ అని ఈ రోజు మొత్తం 23 రైళ్లు ఎల్టిటి నుండి బయలుదేర వలసి ఉంది, వీటిలో 16 రైళ్లు నార్త్ కు వెళుతున్నాయని వీటిలో 16, 5 సమ్మర్ స్పెషల్ రైళ్లు ”అని సెంట్రల్ రైల్వే సిపిఆర్ఓ ఈ రోజు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news