రాజాసింగ్.. నువ్వు హైదరాబాద్ నుంచి వెళ్లిపో.. నెటిజన్ల సెటైర్లు

-

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ గుర్తున్నాడా మీకు. నిన్ననే ఆవేశపడి వివాదంలో చిక్కుకున్నాడు కదా. మజ్లీస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను తెలంగాణ అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేశారు కదా. దానిపై ఆయన ఏమన్నాడో తెలుసు కదా. ముస్లిం స్పీకర్ ఉంటే నేను అసెంబ్లీకి రాను అంటూ తెగేసి చెప్పాడు రాజాసింగ్. దీంతో నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చినట్టుంది. దీంతో సోషల్ మీడియాలో రాజాసింగ్‌ను ఓ ఆట ఆడుకున్నారు.

అవునా… రాజాసింగ్. నువ్వు అసెంబ్లీ వెళ్లకు అయితే. అసెంబ్లీని ముస్లిం రాజు కట్టించాడు. అలాగే గోషామహల్‌ను కూడా నువ్వు వదిలేయాల్సిందే. అక్కడి నుంచి పోవాల్సిందే. ఎందుకంటే.. గోషామహల్‌ను కట్టింది కూడా ముస్లింలే. నీకు ఇంకో ఆప్షన్ కూడా లేదు. హైదరాబాద్ నుంచి కూడా వెళ్లిపోవాల్సిందే. హైదరాబాద్‌ను ముస్లిం రాజే కట్టించాడు. ఇది హైదరాబాద్.. ఇక్కడి ప్రజలు గంగాజమూనా తహజీబ్(గంగా యమూనా నదుల్లా కలిసే ఉంటారని అర్థం)లా ఉంటారు. అయినా.. ఇవన్నీ నీకు అర్థం కావులే. నీకు అంత జ్ఞానం కూడా లేదు. పో.. రాజస్థాన్ పోయి ఏదన్నా పని చూసుకోపో.. అంటూ నెటిజన్లు రాజాసింగ్‌పై సెటైర్లు వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news