పనిచేయకుండా పబ్లిసిటీతోనే గడిపేస్తున్న చంద్రబాబు..తలసాని

-

ఏపీలో ఏమాత్రం పని చేయకుండా తెదేపా ప్రభుత్వం పబ్లిసిటీతోనే గడిపేస్తుందని తెరాస ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం తెల్లవారుజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన మీడియాతో మాట్లాడుతూ… చంద్రబాబుపై సంచల వ్యాఖ్యలు చేశారు.. కొత్తగా ఏర్పడిన ఏపీలో పరిపాలన సక్రమంగా లేదంటూ విమర్శించారు. ఏపీ ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ తరహాలో పలు రకాల కార్యక్రమాలతో దీక్షలకు కూర్చుంటోందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఎన్టీఆర్ తెదేపాని ప్రారంభిస్తే, చంద్రబాబు వారితోనే కలిసి ఆయన ఆశయాలను తుంగలోకి తొక్కి పార్టీ సిద్ధాంతాలను పక్కన బెట్టి కాంగ్రెస్ వెంటబడుతున్నారని విమర్శించారు.

తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు సుఖంగా ఉండాలని కేసీఆర్ కోరుకుంటారని ఆయన తెలిపారు. త్వరలో ఏపీలో జరగనున్న ఎన్నికల్లో కేసీఆర్ కీలక పాత్ర పోషిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తలసాని వ్యాఖ్యలతో ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Latest news