లాక్ డౌన్ సడలింపులపై అన్ని రాష్ట్రాలకు కేంద్రహోంశాఖ లేఖ

-

న్యూఢిల్లీ: అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖ రాశారు. పలు రాష్ట్రాల్లో కరోనా ఆంక్షల సడలింపుల నేపథ్యంలో సూచనలు చేశారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేయడం ఆధారంగా ఆంక్షలు విధించడం లేదా సడలింపులు ఇవ్వాలని లేఖలో పేర్కొన్నారు. ఆంక్షల మినహాయింపుల అనంతరం కూడా కరోనా నియంత్రణకు 5 సూత్రాలను అమలు చేయాలని సూచించారు.

టెస్టింగ్, ట్రాక్, ట్రీట్, వ్యాక్సిన్, నిరంతర నిఘా నియమాలను పాటించాలని తెలిపారు. పరీక్షల సంఖ్యను తగ్గించకుండా కొనసాగించాని అజయ్ భల్లా లేఖలో తెలిపారు. కేసుల సంఖ్య పెరిగినా, పాజిటివిటీ రేటు అధికంగా నమోదైనా ప్రాంతాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ సూచించిన కరోనా నియంత్రణ చర్యలు అమలు చేయాలని ఆదేశించారు. వ్యాక్సినేషన్ ద్వారా కరోనా చైన్ సిస్టంను విచ్ఛిన్నం చేయడం చాలా కీలకమని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రాలు వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని పేర్కొన్నారు. పరిస్థితిని నిశితంగా పరిశీలించి కార్యకలాపాలు జాగ్రత్తగా పునఃప్రారంభించాలని సూచించారు. ఇందుకోసం జిల్లా, సంబంధిత అధికారులకు తగిన ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా లేఖలో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news