నెల్లూరు ప్రేమజంట సుసైడ్‌..ప్రియుడిపై హత్య కేసు..అమ్మాయి మృతి

-

నెల్లూరు జిల్లాలోని గూడూరు ప్రేమజంట ఆత్మహత్యయత్నం కేసులో మరో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. గుడూరు రెండో పట్టణలో గురువారం తేజస్విని, వెంకటేష్‌ ఇద్దరు ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించారు. దీంతో ఆపస్మారక స్థితిలో ఉన్న వారిని గూడురు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు స్థానికులు. ఈ నేపథ్యంలో తేజస్విని మృతి చెందగా.. వెంకటేష్‌ పరిస్థితి విషయంగా ఉంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు.

ఈ నేపథ్యంలో తేజస్విని తండ్రి సంచలన ఆరోపణలు చేశాడు. తమ అమ్మాయిని.. అబ్బాయి కావాలనే చంపాడని తేజస్విని తండ్రి ఆరోపణలు చేస్తున్నాడు. తమ అమ్మాయి ఎవరిని ప్రేమించలేదని…గతంలోనే అబ్బాయి తండ్రికి ఫిర్యాదు చేశామని తండ్రి ఆరోపణలు చేస్తున్నారు. ఈరోజు మేము ఎవరు లేని సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని అమ్మాయి తండ్రి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. తేజస్విని తండ్రి ఆరోపణలు విన్న పోలీసులు… వెంకటేష్‌ పై కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉండగా… నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్ లో ప్రస్తుతం వెంకటేష్ చికిత్స పొందుతున్నాడు.

ప్రేమ వివాహానికి యువతి తల్లిదండ్రులు ఒప్పుకోకపోవడం వల్లే ఆత్మహత్యకు యత్నించామని..తాను తేజస్వినిని హత్య చెయ్యలేదని పేర్కొన్నాడు. ఇద్దరం కలిసి ఉరేసుకుని చనిపోదాం అనుకున్నామని.. ఇద్దరం కొన్నిఏళ్లుగా ప్రేమించుకుంటున్నామన్నాడు వెంకటేష్‌. క్యాస్ట్ ఫీలింగ్ వల్ల వాళ్ల ఇంట్లో ఒప్పుకోలేదని.. దూరంగా ఉండలేకే.. కలిసి చనిపోదాం అనుకున్నామని తెలిపాడు. అయితే… ఈ కేసుపై ప్రస్తుతం పోలీసులు ముమ్మురంగా దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news