BREAKING : తీన్మార్​ మల్లన్న అరెస్ట్

-

ప్రముఖ జర్నలిస్ట్‌, యాంకర్‌ తీన్మార్​ మల్లన్న అరెస్ట్ అరెస్ట్‌ అయ్యారు. తీన్మార్‌ మల్లన్న అలియాస్ చింత పండు నవీన్ ను నిన్న అర్థరాత్రి అరెస్ట్ చేశారు చిలకలగూడ పోలీసులు. మల్లన్న తనను డబ్బుల కోసం బ్లాక్​ మెయిల్​ చేశాడని ప్రముఖ జ్యోతిష్య నిపుణులు లక్ష్మీకాంత్​ శర్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూ. 30 లక్షలు డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసాడని, ఇవ్వక పోయే సరికి తనను బ్లాక్ మెయిల్ చేశాడంటూ ఫిర్యాదు చేశారు జ్యోతిష్య నిపుణులు లక్ష్మీకాంత్​ శర్మ.

Teenmar Mallanna | తీన్మార్‌ మల్లన్న

ఈ నేపథ్యంలో తీన్మార్‌ మల్లన్నను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అటు ఇప్పటికే తీన్మార్ మల్లన్న ను నోటీసులు ఇచ్చి విచారణ చేశారు పోలీసులు. సీతాఫల్​ మండి లోని మధురానగర్​లో మారుతీ జ్యోతిష్యాలయం’ అనే ఓ సంస్థను నిర్వహిస్తున్నారు లక్ష్మీకాంత శర్మ. అయితే… ఇటీవలే క్యూ న్యూస్​ యూట్యూబ్​ చానల్​లో మారుతీ జ్యోతిష్యాలయం పై వరుస కథనాలు ప్రసారం చేశారని మల్లన్న పై ఆరోపణ కూడా ఉన్నాయి.వీటన్నిటి నేపథ్యంలో అర్థరాత్రి మల్లన్నను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఇక అటు తీన్మార్ మల్లన్న ఒక టెర్రరిస్టు లాగా ఒక తీవ్రవాది లాగా రాత్రికి రాత్రి అరెస్టు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న మల్లన్న పై ఇలా అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ మేరకు చలో చిలకలగూడ పిలుపు నిచ్చారు. తీన్మార్‌ మల్లన్నకు ఇలా కావాల్సిందేనని అటు టీఆర్‌ఎస్‌ పార్టీ సోషల్‌ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news