మా ఎన్నికల్లో ఓటు వేయను..ఎన్టీఆర్ అసహనం..!

-

ప్రస్తుతం ఎక్కడ చూసినా మా ఎన్నికలపైనే చర్చ జరుగుతోంది. ఈ సారి ఎన్నికల బరిలో ప్రకాష్ మంచు విష్ణు ఉన్నారు. సివిఎల్ నరసింహారావు కూడా నామినేషన్ దాఖలు చేయగా మళ్ళీ ఆయన తన నామినేషన్ను వెనక్కి తీసుకున్నారు. ఇక వాడివేడిగా సాగుతున్న మా ఎన్నికల ప్రచారం జరుగుతుండగా… ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. అయితే తాజాగా మా ఎన్నికలపై జీవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తను ఇటీవల ఓ పార్టీలో జూనియర్ ఎన్టీఆర్ ను కలిసానని జీవిత వెల్లడించారు ఈ సందర్భంగా తాను ఉపాధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నానని తనకు ఓటు వేయాలని ఎన్టీఆర్ ను కోరినట్లు తెలిపారు.

ఎన్టీఆర్ మా ఎన్నికల పై అసహనం వ్యక్తం చేశారని వెల్లడించారు. అంతేకాకుండా మా ఎన్నికల్లో ఓటు వేసేందుకు కూడా ఎన్టీఆర్ రానని చెప్పారన్నారు. మా లో నెలకొన్న పరిస్థితులు చూస్తుంటే బాధగా ఉందని ఎన్టీఆర్ చెప్పారన్నారు. అంతేకాకుండా తనను ఇకపై ఎవరు ఓటు వేయమని అడగవద్దని అన్నారని చెప్పారు. ప్రస్తుతం మా పరిస్థితి నిజంగానే అలా ఉందని జీవిత అన్నారు. ఇదిలా ఉంటే మంచు విష్ణు ఇండస్ట్రీలో ప్రముఖుల దగ్గరికి వెళ్లి మద్దతు కోరుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా బాలయ్యను కలిసిన విష్ణు నటసింహం మద్దతు తనకే ఉంటుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news