ఉపరాష్ట్రపతిగా కేసీఆర్.. క్లారిటీ ఇచ్చిన కేటీఆర్..!

-

త్వరలో కేసీఆర్ ఉపరాష్ట్రపతి కాబోతున్నారని అదేవిధంగా కేటీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ అమిత్ షా లతో ఇదే విషయంపై చర్చించారు అని కూడా ప్రచారం జరిగింది. ఈ వార్త వాట్సాప్ లో తెగ చక్కర్లు కొట్టింది. అయితే ఈ విషయంపై తాజాగా కేటీఆర్ స్పందించారు. సీఎం కేసీఆర్ ఉపరాష్ట్రపతి కాబోతున్నారు అంటూ జరుగుతున్న ప్రచారం ఉత్తిదే అని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు.ktr

కేసీఆర్ ఉపరాష్ట్రపతి అనేది వాట్సాప్ యూనివర్సిటీ ప్రసారం మాత్రమేనని కొట్టిపారేశారు. సందర్భాన్ని బట్టి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లటం అనే అంశం చర్చ లోకి వస్తుంది అని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా కొడంగల్ లో ఓడితే రాజకీయ సన్యాసం చేస్తానని రేవంత్ రెడ్డి ఎందుకు సవాల్ చేయలేదు అని కేటీఆర్ ప్రశ్నించారు. అంతే కాకుండా ఈటెల తన బాధలు అన్నీ ప్రపంచ బాధల్లా ఫీల్ అవుతున్నారు అంటూ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news