ఏపీ : మరో రెండు గంటల్లో పెళ్లి…. ఇంతలోనే వధువు కు బిగ్ షాక్..!

-

ప్రేమించిన యువతతోనే మరో రెండు గంటల్లో పెళ్లి ఉండగా యువకుడు ఆమెకు షాక్ ఇచ్చాడు. సరిగ్గా పెళ్లి సమయానికి జంప్ అయ్యాడు. ఈ ఘటన కృష్ణా జిల్లా పెనమలూరు లో చోటుచేసుకుంది. పెనమలూరు కు చెందిన దాసరి అనిల్ అనే యువకుడు స్థానికంగా ఉండే యువతితో ఐదేళ్లుగా ప్రేమాయణం నడుపుతున్నాడు. ఇద్దరూ మేజర్ లు కావడంతో పెద్దలను ఒప్పించి పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే గురువారం ఉదయం 11 గంటలకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ముహూర్తానికి సరిగ్గా రెండు గంటల ముందు ఉదయం 9 గంటలనుండి అనిల్ కనిపించకుండా పోయాడు.marriage

కుటుంబీకులు బంధువులను స్నేహితులను ఆరాతీశారు. అయినప్పటికీ అనిల్ ఆచూకీ దొరకలేదు. దాంతో చివరికి అనిల్ మోసం చేసి పారిపోయాడు అని గ్రహించారు. ఈ ఘటనపై యువతి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనిల్ కోసం ఆరా తీస్తున్నారు. ఐదేళ్లుగా ప్రేమించి పెళ్లి సమయానికి వెళ్లిపోయిన ప్రియుడి పై ప్రియురాలు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పీటలమీద కూతురు పెళ్ళి అయిపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news