ఆస్పత్రి నుంచి మాజీ ప్రధాని మన్మోహన్ డిశ్చార్జ్

-

భారత మాజీ ప్రధాని, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మన్మోహన్ సింగ్ ఆస్పతి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కాసేపటి క్రితమే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి వైద్యులు. ఆరోగ్యం మెరుగు కావడం తో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎయిమ్స్ ఆసుపత్రి నుండి ఆదివారం డిశ్చార్జ్ చేశారు వైద్యులు.

మాజీ ప్రధాని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అక్టోబర్ 13 సాయంత్రం పూట దేశ రాజధాని ఢిల్లీ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (AIIMS)లో చేరారు. మన్మోహన్ సింగ్ కు కార్డియో న్యూరో కు సంబంధించిన పరీక్షలు చేశారు వైద్యలు. ఇక ఆయన పరిస్థితి మెరుగు పడటం తో ఇవాళ డిశ్చార్జ్ చేశారు. దీంతో ఆయన కుటుంబం తో పాటు కాంగ్రెస్ నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

కాగా గత ఏప్రిల్‌ మాసం లో కూడా కరోనా వైరస్ బారిన పడిన మన్మోహన్ సింగ్ ఎయిమ్స్‌లో చేరిన సంగతి తెలిసిందే. ఒక నెల రోజుల పాటు వైద్యం అందించిన తర్వాత మన్మోహన్ సింగ్ డిశ్చార్జ్ అయ్యారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news