BREAKING : టి20 కెప్టెన్ గా రోహిత్ శర్మ నియామకం… వైస్ కెప్టెన్ గా కె.ఎల్ రాహుల్

-

బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. టీమిండియా టి20 జట్టు కెప్టెన్ గా… భారత ఓపెనర్ రోహిత్ శర్మ ను నియమించింది. రోహిత్ శర్మను టీమ్ ఇండియా టి20 కెప్టెన్ గా నియమించడమే కాకుండా.. టీమిండియా మరో ఓపెనర్ కె.ఎల్ రాహుల్ ను వైస్ కెప్టెన్ గా నియామకం చేసింది బీసీసీఐ.

టి20 వరల్డ్ కప్ అనంతరం కెప్టెన్సీ నుంచి.. విరాట్ కోహ్లీ తప్పుకున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ పాలకమండలి. వచ్చే న్యూజిలాండ్ టూర్ నుంచి.. టీమ్ ఇండియా కెప్టెన్ గా రోహిత్ శర్మ అలాగే వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈనెల 17వ తారీకు నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు… న్యూజిలాండ్, టీమిండియా జట్ల మధ్య టి 20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే బీసీసీఐ పాలకమండలి ఈ ప్రకటన చేసింది. కాగా నిన్న నమీబియా తో జరిగిన మ్యాచ్ అనంతరం.. టి20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు విరాట్  కోహ్లీ.

Read more RELATED
Recommended to you

Latest news