మంచిరేవుల పేకాట కేసు : సుమ‌న్ కు బెయిల్

-

మంచిరేవుల లో ఉన్న టాలీవుడ్ యంగ్ హీరో నాగ‌శౌర్య గెస్ట్ హౌస్ లో పేరాట కేసు రాష్ట్రం మొత్తం సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. ఈ కేసులో ఏ-1 గా గుత్తా సుమన్ కుమార్ ను పోలీసులు చేర్చి అరెస్టు చేశారు. ఈ కేసు లో గుత్తా సుమ‌న్ కుమార్ కు ఉప్పరపల్లి కోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఏ-1 గా ఉన్న గుత్తా సుమన్ కుమార్ ను ఇప్పటి వ‌ర‌కు కోర్టు ఆదేశాలతో పోలీసులు రిమాండ్ లో ఉంచారు.

ఈ రిమాండ్ కాలంలో హైద‌రాబాద్ న‌గరంలో వివిధ చోట్ల జ‌రుగ‌తున్న పేకాట శిబిరాల వివరాల‌ను పోలీసులు సేక‌రించిన‌ట్టు తెలుస్తుంది. అలాగే ఈ కేసులో ఉన్న ప్ర‌ధాన నిందుతుల వివ‌రాల‌ను గుత్తా సుమ‌న్ కుమార్ ద్వార పోలీసులు సేక‌రించిన‌ట్టు స‌మ‌చారం. అంతే కాకుండ ప‌లువురు నిందుతుల‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. కాగ ఈ రోజు గుత్తా సుమ‌న్ కుమార్ కు రూ. 10 వేల పూచి క‌త్తు తో ఉప్ప‌ర‌ప‌ల్లి కోర్టు బెయిల్ ను మంజూరు చేసింది. దీంతో చర్లపల్లి జైలు నుండి నేడు గుత్తా సుమ‌న్ కుమార్ విడుదలకానున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news