BREAKING : పాకిస్తాన్‌ లో భారీ పేలుడు..10 మంది మృతి

-

మ‌న దాయాది దేశ‌మైన పాకిస్థాన్ దేశంలో ఘోర ప్ర‌మాదం చోటు చేసుకుంది. పాకిస్తాన్ దేశంలోని క‌రాచీ లో ఈ భారీ పేలుడు సంభ‌వించింది. ఈ ఉగ్ర‌దాడి లో ఏకంగా 10 మంది పాకిస్థాన్ దేశ‌స్తులు దుర్మ‌ర‌ణం చెందారు. ఈ భారీ పేలుడు ధాటికి.. పెద్ద‌, పెద్ద‌ భ‌వ‌నాలు ధ్వంసం అయ్యాయి.

ఇక ప్ర‌మాదం సంఘ‌ట‌న తెలుసుకున్న పోలీస్ అధికారులు… సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకున్నారు. ప్ర‌స్తుతం స‌హాయ‌క చ‌ర్య‌లు కొనసాగుతున్నాయి. ఈ సంఘ‌ట‌న లో చాలా మంది గాయాల పాలైయ్యారు. ఇంకా ఈ సంఘ‌ట‌న లో మ‌ర‌ణాల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉన్న‌ట్లు స‌మాచారం అందుతోంది.

అయితే.. ఈ సంఘ‌ట‌న ఉగ్ర వాదులే చేసి ఉంటార‌ని పాకిస్థాన్ మీడియా ల్లో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. కానీ అధికారికంగా.. మాత్రం ఉగ్ర వాదులు.. ఈ సంఘ‌ట‌న పై ఎలాంటి ప్ర‌క‌ట‌న అధికారికంగా చేయ‌లేదు. దీని పై ఇంకా వివ‌రాలు తెలియాల్సి ఉంది. అటు స‌హాయ‌క చ‌ర్య‌లను ముమ్మ‌రం చేయాల‌ని ఆదేశాలు జారీ చేశారు ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌.

Read more RELATED
Recommended to you

Latest news