బొప్పాయి పండు తినేసి గింజల్ని పడేస్తున్నారుగా..?వాటితోనూ చాలా ఉపయోగాలున్నాయ్‌ తెలుసా..!

-

బొప్పాయి పండు రుచి చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా ఈ పండు చాలా మంచిది. విటమిన్‌ సీ, యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైబర్‌ ఇంకా ఎన్నో పోషక పదార్థాలు ఈ పండులో పుష్కలంగా ఉన్నాయి. ఎర్రరక్తకణాలు పెంచే శక్తి ఈ పండులో ఉంది. బొప్పాయి పండుతో పాటు ఆకుల్లో కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి అని ందరికి తెలుసు. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే..బొప్పాయి గింజలు కూడా చాలా మంచివని. ఆరోగ్యానికి వీటివల్ల బోలెడు ప్రయోజనాలు ఉన్నాయని మీకు తెలుసా. మనలో చాలామంది..బొప్పాయిగింజలను అయితే పారేస్తారు లేదా..పెరట్లో నాడతారు. అయితే ఈరోజు బొప్పాయి గింజల వల్ల ఉపయోగాలు ఏంటో చూద్దాం.

జీర్ణక్రియ సమస్యలు ఉన్న వాళ్ళు బొప్పాయి గింజలు తీసుకుంటే చాలా మంచిది. దీంతో జీర్ణం బాగా అవుతుంది.

లివర్ కి కూడా ఈ గింజలు ఎంతో మేలు చేస్తుంది. బొప్పాయి గింజలు పొడి చేసుకుని తీసుకుంటే లివర్ సమస్యల నుంచి దూరంగా ఉండొచ్చు.

బరువు పెరిగే వారు బొప్పాయి గింజలు తీసుకుంటే కొవ్వు కరిగించుకోవడానికి బాగా సహాయపడుతుంది.

బొప్పాయి గింజలు తీసుకోవడం వల్ల డెంగ్యూ జ్వరం కూడా తగ్గుతుంది.

కిడ్నీ సమస్యలు తగ్గించడానికి కూడా బొప్పాయి గింజలు ఉపయోగపడతాయి.

నులిపురుగల సమస్యతో బాధపడేవారికి కూడా బొప్పాయి గింజలతో మంచి ఫలితం ఉంటుంది.

బొప్పాయి గింజలు రోగనిరోధకశక్తి గా కూడా పనిచేస్తాయి. అంతేకాకుండా కడుపులో మంట,అజీర్తి, గ్యాస్ వంటి సమస్యల నుంచి బయటపడేలా చేస్తాయి.

చర్మం మీద ఏర్పడే పుండ్లు, గాయాలు,ఇన్ఫెక్షన్లను కూడా త్వరగా నయం చేయగల శక్తి ఈ బొప్పాయి గింజలకు ఉంది.

ప్రతిరోజూ బొప్పాయి గింజలతో కలిపి తేనె తింటే పిరియడ్స్‌ సమయంలో వచ్చే నొప్పినుండి తప్పించుకోవచ్చు. ఆ సమయంలో.. శరీరంలో మంట స్థాయి తగ్గుతుంది. ఫలితంగా, నొప్పి అసౌకర్యం తగ్గడానికి సమయం పట్టదు.

ఈ గింజలును తేనెను క్రమం తప్పకుండా తినడం ప్రారంభిస్తే..,చర్మం లోపల పేరుకుపోయిన విష పదార్థాలు బయటకు వస్తాయి. ఫలితంగా, ముడతలు తగ్గుతాయి.

కండరాలను నిర్మించడంలో బొప్పాయి గింజలు ప్రత్యేక పాత్ర పోషిస్తాయి.. కాబట్టి మీరు కండలు రావాలంటే వీటిని తినటం ప్రారంభించండి.

ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ గింజలు అందరూ తినవచ్చు. కానీ దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు, గర్భీణీలు, బాలింతలు వీటిని తినాలనుకుంటే మాత్రం మీ వైద్యుల సలహా తీసుకునే తినటం ప్రారంభించండి.

Read more RELATED
Recommended to you

Latest news