పాల్వంచ తరహాలోనే ఏపీలో ఒకే కుటుంబంలో నలుగురు ఆత్మహత్య

-

పాల్వంచ తరహాలోనే… విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చిన ఓ కుటుంబం సుసైడ్‌ చేసుకుంది. ఒకే కుటుండానికి చెందిన నలుగురు వ్యక్తులు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది. బెజవాడలోని కన్యకా పరమేశ్వరి సత్రం లో తల్లీ, కొడుకు విషం తాగి సుసైడ్‌ చేసుకోగా… కృష్ణా నదిలో దూకి తండ్రి, మరో కొడుకు ప్రాణాలు వదిలారు. మృతులు తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లా భైంసాకు చెందిన పుప్పుల సురేష్‌, అతని భార్య శ్రీ లత, కుమారులు ఆశిష్, అఖిల్‌ గా గుర్తించారు.

ఆర్థిక ఇబ్బందుల కారణంగానే కుటుంబం ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు సమాచారం. ఈ నెల 6 వ తేదీన దుర్గమ్మ దర్శనం కోసం విజయవాడకు వచ్చిన కుటుంబం కన్య కాపరమేశ్వరి సత్రంలో… బస చేసింది. దుర్గమ్మ దర్శనం అనంతరం ఈ రోజు తెల్లవారుజామున తల్లి శ్రీలత, కొడుకు ఆశిష్‌ సత్రంలో.. విషం తాగి చనిపోగా… తండ్రి సురేష్‌, మరో కొడుకు అఖిల్‌ కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇక ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news