కొత్త బిచ్చగాళ్లు వచ్చినట్టు బిజేపి సిఎంలు వస్తున్నారు : రేవంత్ రెడ్డి

-

కొత్త బిచ్చగాళ్లు వచ్చినట్టు బిజేపి సిఎంలు తెలంగాణ రాష్ట్రానికి వస్తున్నారని కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అస్సాం సిఎం హేమంత్ బిస్వల్ బతుక్కి కారణం కాంగ్రెస్ అని రేవంత్ రెడ్డి చురకలు అంటించారు. బీజేపీకి అమ్ముడు పోయి.. ఇందిరా గాంధీతో కెసిఆర్ నీ పోల్చుతవా ? బీజేపీ వాళ్ళు సిగ్గులేకుండా తయారయ్యారని నిప్పులు చెరిగారు. పాకిస్థాన్ మెడలు వంచిన ఇందిరా గాంధీ పేరు ఎత్తే అర్హత బీజేపీ కి లేదని ఫైర్ అయ్యారు.

తెలంగాణలో లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తే బలమైన పార్టీ అవుతుందని కెసిఆర్ కి భయం పట్టుకుందని.. అందుకే లెఫ్ట్ పార్టీలతో దోస్తీ చేయాలని చూస్తున్నారని అగ్రహించారు. కమ్యూనిస్టుల మీద ఇప్పుడు ప్రేమ పుట్టిందని కెసిఆర్ కు చురకలు అంటించారు. యూపీఏ కి దగ్గర ఉన్న వాళ్ళను దూరం చేసేందుకు కెసిఆర్ సుపారి చేస్తున్నాడని.. ఉత్తర ప్రదేశ్ లో కెసిఆర్.. సమాజ్ వాదీ పార్టీ కి మద్దతు ఇస్తాడా .? అని ప్రశ్నించారు.

లెఫ్ట్ పార్టీలు యూపీలో అఖిలేష్ కి మద్దతు ఇస్తున్నాయని.. మరి యూపీ లో సమాజ్ వాదీ పార్టీకి మద్దతు పలుకు తావా..? అని కెసిఆర్ ను ప్రశ్నించారు. బీజేపీ,టిఆర్ఎస్ ఉమ్మడి డ్రామాలు అడి జనాన్ని మభ్యపెడుతూ ఉన్నాయని అగ్రహించారు. మేకిన్ ఇండియా అని చెప్పిన బీజేపీ… చైనా లో తయారు చేసిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తెచ్చింది బీజేపీ అని ఫైర్ అయ్యారు. చైనా నుండి విగ్రహం తెప్పించి..బయటకు మాత్రం దేశభక్తి మాది అని చెప్పుకుంటున్నారని అగ్రహించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news