రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనా పాజిటివ్..

-

చైనా వూహాన్ నగరంలో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కలవర పరుస్తోంది. అన్ని దేశాల్లో ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఆల్ఫా, బీటా, డెల్టా, డెల్టా ప్లస్, ఓమిక్రాన్ వేరియంట్ల రూపంలో ప్రపంచ దేశాలను వణికిస్తోంది. తాజాగా ఓమిక్రాన్ వేరియంట్ ప్రపంచంతో పాటు మనదేశంలో కూడా తీవ్రంగా వ్యాపిస్తోంది. ఇప్పటికే కేసుల సంఖ్య 4 వేలను దాటింది. మరోవైపు రోజూవారీ కేసుల సంఖ్య లక్షను దాటాయి. దీంతో థర్డ్ వేవ్ భయాలు మొదలయ్యాయి.

opposition slams Rajnath singh russia tour

అయితే ఇటీవల వరసగా సెలబ్రెటీలు, రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్నారు. తాజాగా దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కరోనా సోకింది. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నట్లు ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.  ఇటీవల తనను కలుసుకున్న వారు జాగ్రత్తగా ఉండాలని, కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. ఇదిలా ఉంటే ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. మహారాష్ట్రలో ఏకంగా పదుల సంక్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news