భూమి లాక్కున్న టీఆర్‌ఎస్‌ నేత..ఓ వ్యక్తి సెల్ఫీ వీడియో తీసి..ఆత్మహత్య !

-

కరీంనగర్ జిల్లా తిరుమలనగర్ లో సెల్ఫీ సూసైడ్ ఘటన కలకలం రేపుతోంది. కరీంనగర్‌ నగరానికి చెందిన తిప్పారపు శ్రీనివాసాచారి (42) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మ హత్య కు ముందు సెల్ఫీ వీడియో తీసిన శ్రీనివాసాచారి…. తనకు చెందాల్సిన ఆస్తిని టీఆర్ ఎస్ నాయకుడుగా ఉన్న తన అన్న తిప్పారపు ఆంజనేయులు అక్రమంగా తన భార్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని ఆవేదన వ్యక్తం చేశాడు.

తన అక్క లక్ష్మి కూడా మోసం చేసిందని సెల్పీ వీడియోలో తెలిపాడు మృతుడు. కరీంనగర్ లోని భగత్ నగర్ ప్రాపర్టీ విషయంలో తనకు అన్యాయం జరిగిందని శ్రీనివాసచారి సెల్ఫీ వీడియోలో వివరణ ఇచ్చాడు. ఇక సంఘటనపై బాధిత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అయితే.. ఈ సెల్పీ వీడియో ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు కరీంనగర్‌ పోలీసులు. ఈ సంఘటన పై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news