క‌రోనా ఎఫెక్ట్ : భార‌త్ – వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్‌లో మార్పులు!

-

భార‌త‌దేశాన్ని క‌రోనా వైర‌స్ వెంటాడుతుంది. ఈ రోజు మూడు ల‌క్ష‌లకు పైగా కేసులు న‌మోదు అయ్యాయి. అయితే దీని ప్ర‌భావం భార‌త్ – వెస్టిండీస్ మ‌ధ్య జ‌ర‌గ‌బోయే సిరీస్ పై ప‌డింది. వ‌చ్చె నెల 6 వ తేదీ నుంచి ప్రారంభం కావాల్సిన భార‌త్ – వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్ లో మార్పులు జ‌రిగి అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఇండియాలో రోజు రోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో ఈ సిరీస్ షెడ్యూల్ లో మార్పులు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం. ప్ర‌స్తుతం ఉన్న షెడ్యూల్ ప్ర‌కారం వ‌న్డే, టీ 20 సిరీస్ ల కోసం మొత్తం ఆరు వేర్వేరు వేదిక‌లు ఉన్నాయి.

కానీ క‌రోనా కార‌ణంగా ఆరు వేదికల‌లో సిరీస్ ను నిర్వ‌హించ‌డం ప్ర‌మాదం అని బీసీసీఐ భావిస్తున్న‌ట్టు తెలుస్తుంది. ఈ ఆరు వేదిక‌ల‌ను కేవ‌లం రెండు వేదిక‌లకు కుదించాల‌ని బీసీసీఐ ప్లాన్ చేస్తున్న‌ట్టు స‌మాచారం. అందుకోసం కాస్త స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంది. దీంతో ఈ సిరీస్ షెడ్యూల్ లో కాస్త మార్పులు జరిపే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. కాగ టీమిండియా సౌత్ ఆఫ్రికా టూర్ తర్వాత స్వ‌దేశానికి చేరుకుంటుంది. దీని తర్వాత వెస్టిండీస్ భార‌త ప‌ర్య‌ట‌న కు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news