రాష్ట్రంలో మళ్లీ పెరిగిన కరోనా వ్యాప్తి.. నేడు 3980 కేసులు

-

తెలంగాణ రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మ‌ళ్లీ పెరిగింది. నిన్న‌టి తో పోలిస్తే నేడు కరోనా కేసుల సంఖ్య 377 పెరిగింది. కాగ నేటి కరోనా బులిటెన్ ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్ల‌డించారు. క‌రోనా బులిటెన్ ప్ర‌కారం నేడు రాష్ట్ర వ్యాప్త‌గా 97,113 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా.. 3,980 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఒక్క జీహెచ్ఎంసీలోనే 1,439 క‌రోనా కేసులు న‌మోదు అయ్యాయి. అలాగే నేడు మ‌ర‌ణాలు కూడా పెరిగాయి. నేడు ముగ్గురు క‌రోనా కాటుకు బలైపోయారు.

దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు కరోనా కాటుకు మ‌ర‌ణించిన వారి సంఖ్య 4,075 కి చేరింది. అలాగే నేడు క‌రోనా వైర‌స్ నుంచి 2,398 మంది కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం రాష్ట్రంలో 33,673 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగ రాష్ట్ర ప్ర‌జ‌లు క‌రోనా వైర‌స్ ప‌ట్ల అజ‌గ్ర‌త్త‌గా ఉంటున్నార‌ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు భావిస్తున్నారు. అందుకే క‌రోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయని అంటున్నారు. ప్ర‌తి ఒక్క‌రు క‌రోనా నిబంధ‌నలు పాటించాల‌ని సూచించారు.

Read more RELATED
Recommended to you

Latest news