BREAKING : ఏపీలో విషాదం.. కల్తీ కల్లు తాగి 5 గురు గిరిజనులు మృతి

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కల్తీ జీలుగు కల్లు త్రాగి ఐదుగురు మృతి చెందారు. ఈ సంఘటన తూర్పుగోదావరి రాజవొమ్మంగి (మం) లోదొడ్డి గిరిజన గ్రామంలో చోటు చేసుకుంది. ఎప్పటి లాగే.. లోదొడ్డి గిరిజన గ్రామంలో.. ఈ ఐదుగురు గిరిజనులు..ఇవాళ కూడా కల్లు తాగారు. అయితే.. ఆ కల్లు వికటించి… 5గురు గిరిజనులు మృతి చెందారు.

దీంతో.. అక్కడే ఉన్న స్థానికులు… జడ్డంగి ప్రాధమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అయితే.. ఆ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. ఇక అత్యవసర వైద్య సహాయం కోసం అడ్డతీగల పిహెచ్ సికి తరలిస్తుండగా మరో 4 గురు గిరిజనులు మృతి చెందారు. ఈ సంఘటన స్థానికలంగా కలకలం రేపుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇక ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని.. దర్యాప్తు చేస్తున్నారు. అసలు వీరి మరణానికి కారణం ఎంటి? ఎవరైనా ప్లాన్‌ చేసారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news